అమెరికాలో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ ...

అమెరికాలో సుపీరియర్‌ కోర్టు జడ్జిగా తొలి తెలుగు మహిళ ...

ముద్ర,తెలంగాణ:- గత కొంతకాలంగా తెలుగు వారు విదేశాల్లో తమ సత్తాను చాటుతున్నారు. ఇప్పటికే భారత సంతతికి చెందిన వ్యక్తి బ్రిటన్‌ ప్రధానిగా ఉండగా..అగ్రరాజ్యంలో అధికార కేబినెట్‌ లో దాదాపు భారత మూలాలు ఉన్నవారు చాలా మంది ఉన్నారు. ఈ క్రమలోనే తాజాగా అగ్ర రాజ్యం లో  తెలుగు మహిళకు అరుదైన గౌరవం లభించింది. కాలిఫోర్నియాలోని శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా విజయవాడకు చెందిన జయ బాదిగ నియమితులయ్యారు. ఈమె 2022 నుంచి కోర్టు కమిషనర్‌గా వ్యవహరించారు. తాజాగా శాక్రమెంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులయ్యారు. దీని ద్వారా కాలిఫోర్నియాలో కోర్టు జడ్జిగా నియమితులైన తొలి తెలుగు వ్యక్తిగా జయ బాదిగ అరుదైన గౌరవం పొందారు.