బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల

బాసర ట్రిపుల్ ఐటీ నోటిఫికేషన్ విడుదల

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ లో 2023-24 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి నోటిఫికేషన్ బుధవారం విడుదల చేశారు. బాసరలో జరిగిన ఒక కార్యక్రమంలో అధికారులు విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం జూన్ 5 నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు.  జూన్ నెల 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ కేటగిరీ ల్లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 24. అర్హులైన అభ్యర్థుల జాబితా 26న విడుదల చేస్తారు.