కవిత వల్ల మహిళలు తల దించుకునే పరిస్థితి వచ్చింది
కవిత వల్ల మహిళలు తల దించుకునే పరిస్థితి వచ్చిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆపద వచ్చినప్పుడల్లా జై తెలంగాణ అంటారని విమర్శించారు. ఈడీ నోటీసులతో బీజేపీకి సంబంధం లేదన్నారు. తెలంగాణ సమాజానికి చెప్పే స్కామ్ చేశారా? అని ప్రశ్నించారు. ఆరుణ్ పిళ్లయ్ తనకు తెలుసునని కవిత ఒప్పుకుందన్నారు. విచారణలో దర్యాప్తు సంస్థలకు కవిత సహకరించాలన్నారు. చట్టానికి అందరూ సమానమే అన్నారు.