పీవీఎన్​ఆర్​ హైవేపై కారు బోల్తా ఇద్దరు సేఫ్​‌‌.. భారీగా ట్రాఫిక్​ జాం

పీవీఎన్​ఆర్​ హైవేపై కారు బోల్తా ఇద్దరు సేఫ్​‌‌.. భారీగా ట్రాఫిక్​ జాం

ముద్ర, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి జిల్లా పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ప్రమాదం చోటు చేసుకుంది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డైరీ ఫార్మ్ పిల్లర్ నెంబర్ 215 వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వైపు వస్తున్న కారు పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వేపై ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ప్రయాణికుస్తున్న ఇద్దరు స్వల్పగాయాలయ్యాయి. కారు హైవేపై అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ జాం అయింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ట్రాఫిక్‌ జామ్‌ను క్లియర్ చేసే పనిలో పడ్డారు. అతివేగం కారణంగానే కారు డివైడర్‌ను ఢీకొని పల్టీ కొట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. కారు బోల్తా కొట్టిన విధానం.. కారు ధ్వంసమైన విధానం చూస్తే కచ్చితంగా భారీ ప్రాణనష్టం జరిగిందని భావించారు. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు.