లారీ కింద రూ.8 కోట్ల 40 లక్షలు సీజ్...
![లారీ కింద రూ.8 కోట్ల 40 లక్షలు సీజ్...](https://mudranews.in/uploads/images/2024/05/image_750x_663c625fc51e9.jpg)
ముద్ర,ఆంధ్రప్రదేశ్:-ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో పుష్ప మూవీ సీన్ రిపీట్ అయ్యింది. ఇద్దరు దుండగులు లారీ కింద ఏర్పాటు చేసిన అరలో డబ్బులు తరలించేందుకు ప్రయత్నించారు. గరికపాడు చెక్పోస్టు వద్ద అర్ధరాత్రి పోలీసులు ఆ వాహనాన్ని పట్టుకున్నారు. అందులో తనిఖీ చేయగా.. మొత్తం 8 కోట్ల 40 లక్షల రూపాయలు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు నగదు తరలిస్తున్నట్లు గుర్తించారు. ఆ ఇద్దరు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.