ఇల్లందులో మాజీ గవర్నర్ తమిళి సై పర్యటన..
![ఇల్లందులో మాజీ గవర్నర్ తమిళి సై పర్యటన..](https://mudranews.in/uploads/images/2024/02/image_750x_65d36d0abb410.jpg)
ముద్ర,తెలంగాణ:- తెలంగాణ మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళి సై సౌందర రాజన్ ఇవాళ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇల్లందులో పర్యటించనున్నారు. మహబూబ్ బాద్ లోక్ సభ బీజేపీ అభ్యర్థి సీతారాం నాయక్ గెలుపును కాంక్షిస్తూ జరగనున్న రోడ్ షో లో ఆమె పాల్గొననున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గోపి కృష్ణ కోరారు.