నేడు తెలంగాణలో నేడు రాహుల్ గాంధీ పర్యటన
![నేడు తెలంగాణలో నేడు రాహుల్ గాంధీ పర్యటన](https://mudranews.in/uploads/images/2023/11/image_750x_65573c50c86c3.jpg)
ముద్ర,తెలంగాణ:-లోక్సభ ఎన్నికల పోలింగ్ దగ్గరికొస్తున్న నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు ప్రచారాల్లో మునిగిపోయాయి. అత్యధికంగా ఎంపీ సీట్లు గెలుచుకోవాలని కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య గట్టి పోటీ ఉండనుంది.ఈ నేపద్యంలో ఈరోజు తెలంగాణకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రానున్నారు. మెదక్ జిల్లాలోని నర్సాపూర్, హైదరాబాద్లోని సరూర్నగర్లో నిర్వహించే ఎన్నికల ప్రచార సభల్లో ఆయన పాల్గొననున్నారు.సాయంత్రం 4.00 PM గంటలకు నర్సాపూర్, 6.00 PM గంటలకు సరూర్నగర్ స్టేడియంలో నిర్వహించే సభలకు హాజరుకానున్నారు. రాహుల్ గాంధీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.