మెదక్ లో ఆర్టీసీ కార్మికుల సంబరాలు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

మెదక్ లో ఆర్టీసీ కార్మికుల సంబరాలు కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

ముద్ర ప్రతినిధి, మెదక్: ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సంస్థను తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల మెదక్ డిపో ఆవరణలో మంగళవారం సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి డిఎం సుధా ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. మిఠాయిలు పరిచి టపాకాయలు కాల్చి తమ హర్షత్యేకల్ వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు రవాణా మంత్రి పువ్వాడ అజయ్, సంస్థ చైర్మన్ భాగ్యరెడ్డి గోవర్ధన్ స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేంద్రులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ సంబరాలలో ఎం.ఎఫ్ తిరుమలేష్, సూపరిండెంట్  సుధాకర్, కార్మిక నాయకులు శాఖయ్య, మొగులయ్య, బివి నారాయణ, సుబ్బారావు, రమేష్, సంగమేశ్వర్, శేఖర్, నర్సింలు, సత్యనారాయణ, ఎజాజ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.