ఏడుపాయల అర్చకులు పార్టీవ శర్మకు ఉగాది పురస్కారం

ఏడుపాయల అర్చకులు పార్టీవ శర్మకు ఉగాది పురస్కారం

ముద్ర ప్రతినిధి, మెదక్: ప్రతి ఏటా ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అందజేసే ఉగాది  పురస్కారం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని దేవస్థానం అర్చకులు రావికోటి పార్దివ శర్మ అందుకున్నారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో జరిగిన శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకల సందర్బంగా ప్రభుత్వ ఉగాది పురస్కారం  అర్చకులు రావికోటిపార్థివశర్మకు తెలంగాణ దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  చేతుల మీదుగా అందుకున్నారు. పార్థివ శర్మకు ఉగాది పురస్కారం రావడం వల్ల స్థానిక ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, దేవస్థానం చైర్మన్ సాతెల్లి బాలగౌడ్, ఈవో సార శ్రీనివాస్, ప్రధాన అర్చకుడు శంకర్ శర్మ, అర్చక బృందం అభినందనలు తెలిపారు.