మీ దయవల్ల నేను మంత్రి నవ్వుతా..

మీ దయవల్ల నేను మంత్రి నవ్వుతా..
  •  నాపై అసత్య ప్రచారాలు చేస్తుర్రు...

ముద్ర ప్రతినిధి, నాగర్ కర్నూల్ జిల్లా:   20 ఏళ్లుగా నేను వ్యాపారంలో ఉన్న..  మూడు సార్లు ఈ దాడులు జరిగిన , సార్లు క్లీన్ చిట్ ఇచ్చారనీ నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు.  రాజకీయ కక్షల తోటి ఈయాల  ఈ దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఐటీ దాడుల అనంతరం నాగర్ కర్నూల్ కి వచ్చిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి తిమ్మాజిపేట మండలం మరికల్ దగ్గర స్థానిక టిఆర్ఎస్ నాయకులు కార్లతో ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రానికి కు ర్యాలీగా వచ్చారు. బస్టాండ్ ప్రాంగణంలో స్థానిక టిఆర్ఎస్  నాయకులు ఎమ్మెల్యే కి గజమాలతో సన్మానించి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ  కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం స్థానికంగా పలుకుబడి లేదు.. నాయకత్వ లోపం వుందనీ , ప్రజల్లో బలంగా మంచి పేరు ఉన్న వ్యక్తులను బిజెపి టార్గెట్ చేస్తుందనీ తెలిపారు.  


టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను భయపెట్టి వారినీ పార్టీలోకి తీసుకోవాలని ఉద్దేశంతోటి ఈ దాడులు చేస్తుందని అన్నారు.  కాంగ్రెస్ బిజెపి నాయకులు కొంతమంది కావాలనే నాపై అసత్య ప్రచారాలు చేస్తుండ్రు అని , నాగర్ కర్నూల్ లో మర్రి జనార్దన్ రెడ్డి పై ఒకరైతే గెలవమని ఇద్దరు ఏకమైతుర్రు అని ఎమ్మెల్సీ కుచుకుల్ల దామోదర్ రెడ్డిని మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి దామోదర్ రెడ్డి ఉద్దేశించి సేటైర్లు వేశారు.  ఇక్కడి నేతలకు 75 ఏళ్లు వచ్చినాయి, నడవనిక శాత నవ్వట్లేదు.. అయినా మరో ఒకరిని కలుపుకొని ముందుకు వస్తుండ్రు.. ఇద్దరికీ యేజు వచ్చింది.. మనువర్లతో అనుకోవాలి సూచించారు.  తొమ్మిదేళ్లుగా నాగర్ కర్నూల్  అభివృద్ధి పథంలో ముందుకెళ్తుందనీ, ఈ ప్రాంత ప్రజలు నన్ను ఈ మూడునెలలు కాపాడుకోండి నేను మళ్ళీ గెలిచి ఇంజనీరింగ్ కాలేజీ తెస్త అని హామీ ఇచ్చారు.  మళ్ళీ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అవుతాడనీ  నాగర్ కర్నూల్ లో మర్రి జనార్థన్ రెడ్డి మంత్రి అవుతననీ ఆశాభావం వ్యక్తం చేశారు.