అంబరాన్నంటిన కాంగ్రెస్ సంబరాలు

అంబరాన్నంటిన కాంగ్రెస్ సంబరాలు

హాజరైన పొన్నం ప్రభాకర్

నేడు కర్ణాటక సాధారణ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 136 కు పైగా స్థానాలు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలలో మునిగిపోయారు. జిల్లా వ్యాప్తంగా గ్రామస్థాయి నుండి పట్టణ స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించి కర్ణాటక ఎన్నికల ఫలితాలే తెలంగాణలో పునరావృతం కాబోతున్నాయని ప్రచారం చేపట్టాలని కరీంనగర్ డిసిసి అధ్యక్షులు ఇచ్చిన పిలుపుమేరకు జిల్లావ్యాప్తంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు నిర్వహించి మిఠాయిలు పంచుకున్నారు. కరీంనగర్ టవర్ సర్కిల్ ప్రాంతం నుండి నగరంలోని ప్రధాన వీధులలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు వైద్యులు అంజన్ కుమార్ ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టినారు. 

డీసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ  మానకొండూర్ నియోజకవర్గం నుస్తులాపూర్ నుండి కరీంనగర్ ఇందిరా చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించినారు. డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో డీసీసీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలో బాణాసంచా కాల్చి నగరంలోని ఇందిరా చౌక్ వద్ద నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి  ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సంబరాల కార్యక్రమానికి మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ , డిసిసి అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ గారితో పాటు పలువురు ముఖ్య నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు హాజరై బాణాసంచా కాల్చి, ప్రయాణికులకు మిఠాయిలు పంచుతూ కాంగ్రెస్ జెండాలు చేత పట్టుకొని కర్ణాటక మాదే, తెలంగాణ మాదే అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ కార్యక్రమంలో డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి, రహమత్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పులి ఆంజనేయులు గౌడ్, మడుపు మోహన్, ఎస్ఏ మోసిన్,  రవీంద్ర చారి, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు