పంట రుణమాఫీ తక్షణమే అమలు చేయాలి - కంబాల శ్రీనివాస్

పంట రుణమాఫీ తక్షణమే అమలు చేయాలి - కంబాల శ్రీనివాస్

హుజూర్ నగర్, టౌన్ ,ముద్ర: రాష్ట్రంలో పంట రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కంబాల శ్రీనివాస్ కోరారు. సోమవారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట  రైతు సంఘం నియోజవర్గ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 100మంది రైతులతో ధర్నా నిర్వహించి, పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సూపరిండెంట్ ప్రభాకర్ కి ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పంట రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధరణిలో ఉన్న తప్పులను సవరించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలన్నారు. కల్తీ విత్తనాలను అరికట్టాలని కల్తీ విత్తనాలమ్మే వారిపై నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎల్లావుల రాములు , కొప్పోజుసూర్యనారాయణ, ధనుంజయ నాయుడు ,పోకల వెంకటేశ్వర్లు, దేవర మల్లేశ్వరి, సిపిఐ పట్టణ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు, దొంతగాని సత్యనారాయణ, చిలక రాజు శ్రీనివాసు, అమరారపు పున్నయ్య, రమణ పాల్గొన్నారు.