రేవంత్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ పగిడాల శ్రీనివాస్

రేవంత్ రెడ్డి  సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ పగిడాల శ్రీనివాస్

ముద్ర.కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ,పగిడాల శ్రీనివాస్ మాజీ మంత్రి వర్యులు జూపల్లి కృష్ణారావు అధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి  సమక్షంలో హైద్రాబాద్ లోని వారి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్ పగిడాల శ్రీనివాస్ కు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.కోడెరు మండలం  కదిరేపాడు గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు రామకృష్ణ కు   టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జాతీయ ఓబీసీ కో ఆర్డినేటర్ డాక్టర్ కేతూరీ వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.