ఎన్నికలకు పకడ్బందీ చర్యలు

ఎన్నికలకు పకడ్బందీ చర్యలు

జగిత్యాల డిఎస్పీ వెంకటస్వామి.

సారంగాపూర్ ముద్ర: ఈ నెల 30 న జరిగే శాసన సభ ఎన్నికలకు పకడ్బందీ చర్యలు చేపట్టనున్నట్లు జగిత్యాల డిస్పీ వెంకటస్వామి అన్నారు.గురువారం సారంగాపూర్ మండల కేంద్రంతో పాటు లక్ష్మీదేవీపల్లి గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.ప్రజలు శాంతి యుత వాతావరణంలో స్వేచ్చగా ఓటు హక్కు ను వినియోగించుకోవాలని అన్నారు.మద్యం,డబ్బుల వంటి ప్రలోబాలకు లొంగకుండా ఓటు ను వేయాలన్నారు.పల్లెల్లో శాంతిని నెలకొల్పడానికి కేంద్ర బలగాలను భారీగా మోహరించినట్లు ఆయన తెలిపారు.ఆయన వెంట సారంగాపూర్ ఎస్సై తిరుపతి ఉన్నారు.