కోరుట్ల పట్టణంలో 2K రన్ ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల  విద్యాసాగర్ రావు

కోరుట్ల పట్టణంలో 2K రన్ ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల  విద్యాసాగర్ రావు

కోరుట్ల ముద్ర న్యూస్ : ప్రతి ఒక్కరు ప్రతి నిత్యం వ్యాయామం చేసి ఆరోగ్యం కాపాడుకోవాలని  కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల  విద్యాసాగర్ రావు అన్నారు.కోరుట్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 2K రన్ ను ఎమ్మెల్యే  కల్వకుంట్ల  విద్యాసాగర్ రావు ,ఆర్డీవో వినోద్ కుమార్ లు జండా ఊపి ప్రారంభించారు.2K రన్ లో యువకులతో పాటు చిన్నారులు, వృద్ధులు పాల్గొన్నారు. ముందుగా రన్ చేసిన ముగ్గురు మహిళలు, ముగ్గురు పురుషులకు ఎమ్మెల్యే  బహుమతులు అందజేశారు. అనంతరం డిఎస్పీ రవీంద్ర రెడ్డి మాట్లాడుతూ యువకులు ప్రతి నిత్యం తప్పనిసరిగా వ్యాయామం చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీలు, జడ్పిటిసిలు, సర్పంచులు,  మరియు మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లు, కౌన్సిలర్లు,పోలీసులు,అధికారులు, ప్రజాప్రతినిధులు,కోరుట్ల పట్టణ యువకులు,ప్రజలు పాల్గొన్నారు.