బిజెపితోనే అభివృద్ధి సాధ్యం.
![బిజెపితోనే అభివృద్ధి సాధ్యం.](https://mudranews.in/uploads/images/2023/11/image_750x_6555f957ec986.jpg)
మోత్కూర్(ముద్ర న్యూస్): తుంగతుర్తి అసెంబ్లీ బిజెపి అభ్యర్థి కడియం రామచంద్రయ్యను గెలిపించాలని బీజేపీ నాయకులు స్థానిక చెరువు కట్ట నుండి వర్ధకాలువ ,గడి బజార్ లలొ ఇంటింటిలకి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా బిజెపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ఓటర్ లకు తెపియచేశారు. ఇతర పార్టీలు ఆచరణకు అమలు కానీ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను మభ్యపెట్టి మరోసారి ప్రజలను మోసపుచ్చే ప్రమాదం ఉందని వారసత్వ రాజకీయాలు అవినీతి పాల్పడే పార్టీలు ప్రజల అభివృద్ధి చేయలేవని ప్రజలకు తెలియజేప్పుతూ మోదీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం మాత్రమే ప్రజలకు సేవ చేస్తుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ భారత రాష్ట్ర సమితి ఈ రెండు పార్టీలు కూడా అమ్ముడుకొనుడు పార్టీలని ప్రజలకు వివరించారు. ఒకసారి బిజెపి ప్రభుత్వాన్ని గెలిపించి అభివృద్ధిని చేసే అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి మున్సిపల్ అధ్యక్షులు పోచం సోమయ్య, ఉపాధ్యక్షులు ఆరే శ్రీనివాస్, చేకూరి మత్స్యగిరి, బత్తుల యాదగిరి, జనుకల దశరథ, పోల్కం శివకుమార్, నెలిగొండ మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.