బండి సంజయ్ వెంటనే కవిత కి క్షమాపణలు చెప్పాలి: ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి
![బండి సంజయ్ వెంటనే కవిత కి క్షమాపణలు చెప్పాలి: ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640cbedd94601.jpg)
భువనగిరి (ముద్ర న్యూస్): భువనగిరి పట్టణంలో శనివారం గులాబీ శ్రేణుల ఆందోళన. బండి సంజయ్ డౌన్ డౌన్ అనే నినాదాలతో పట్టణంలోని ప్రిన్స్ చౌరస్తా దద్దరిల్లింది. భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి నాయకత్వంలో ఆందోళన కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వాడిన ప్రజాస్వామిక భాషను ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఖండిస్తున్నారని వెంటనే అతను భేశరతుగా క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.
చౌరస్తాలో బండి సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. సంజయ్ వెంటనే క్షమాపణ చెప్పాలని, ఆడపడుచుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని, నోరుని అదుపులో పెట్టుకోవాలని అతి త్వరలో ప్రజలు బండి సంజయ్ కి బుద్ధి చెప్తారని తెలియజేశారు.