బండి సంజయ్ కి నోటీసులు జారీ చేయనున్న రాష్ట్ర మహిళా కమిషన్
![బండి సంజయ్ కి నోటీసులు జారీ చేయనున్న రాష్ట్ర మహిళా కమిషన్](https://mudranews.in/uploads/images/2023/03/image_750x_640cb529676e2.jpg)
- బండి సంజయ్ పై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్
- ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా తీసుకొని డీజీపీని విచారణకు ఆదేశించిన మహిళా కమిషన్
- బండి సంజయ్ వ్యక్తిగతంగా హజరు కావాలి మహిళా కమిషన్ నిర్ణయం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయనుంది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బండి సంజయ్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మహిళా కమిషన్.
మహిళల గౌరవాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని సునితా లక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర మహిళా కమిషన్ వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించనున్న రాష్ట్ర మహిళా కమిషన్.