మద్యం మత్తులో యువకులు కారుతో బీభత్సం..

మద్యం మత్తులో యువకులు కారుతో బీభత్సం..

రంగారెడ్డి జిల్లా ప్రతినిధి, ముద్ర: మద్యం మత్తులో యువకులు కారుతో బీభత్సం సృష్టించిన ఘటన వనస్థలిపురం ఎన్జీఓస్ కాలనీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే చిత్తుగా మద్యం తాగిన ఇద్దరు యువకులు మంగళవారం తెల్లవారు జామున అతి వేగంగా దూసుకొచ్చారు.

వేగంగా కారు షాప్ ల పైకి తీసుకొచ్చిందని ఉదయం వాకింగ్ చేస్తున్న వారికి తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారు 180 స్పీడ్ లో వున్నట్టు గుర్తించారు. కార్ లో వున్న ఇద్దరు యువకులు సేఫ్ గా ఉన్నట్లు తెలుస్తోంది.