శ్రీకృష్ణదేవరాయల వైభవాన్ని చాటి చెప్పాలి

శ్రీకృష్ణదేవరాయల వైభవాన్ని చాటి చెప్పాలి

 హుజూర్ నగర్, ముద్ర : మఠంపల్లి మండలం మట్టపల్లి లోని శ్రీకృష్ణదేవరాయ మున్నూరు కాపు నిత్య అన్నదాన సత్ర కమిటీ లో గురువారం మట్టపల్లి లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా మట్టపల్లి మాజీ సర్పంచి బజ్జూరు వెంకట నరసయ్య విగ్రహానికి ఘన నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా శ్రీకృష్ణదేవరాయ మున్నూరు కాపు సంఘ నిత్య అన్నదాన సత్ర కమిటీ కన్వీనర్ తోట వెంకయ్య , కో- కన్వీనర్ ఆకుల నాగేశ్వరరావు పట్టపల్లి సర్పంచ్ దాసరి విజయలక్ష్మి వెంకటరమణ మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయల వారసులమని చెప్పుకోవడానికి ఎంతో గర్వంగా ఉన్నదని అన్నారు. ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని చాటి చెప్పాలని పిలుపునిచ్చారు.  

మట్టపల్లి క్షేత్రంలో శ్రీకృష్ణదేవరాయల పేరు మీద సత్రం కట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన వేలాది మంది భక్తులకు అన్నదానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు బజ్జూరు నారాయణస్వామి, కోలా నాగేశ్వరరావు, తిరుపతి వెంకయ్య, తోట అప్పయ్య ,కాశయ్య, నాగ సైదులు, ఆదినారాయణ, మురళి, విజయ, అప్పారావు, అచ్యుతరావు, శ్రీనివాసు, కంబాల రామయ్య, మురళి, వెంకటేశ్వరరావు, జగన్ మోహన్ రావు, భక్తులు పాల్గొన్నారు.