మోడి మరోసారి ప్రధాని కావాలని ప్రజలందరూ సంకల్పించారు: గోవా సీఎం డా. ప్రమోద్ సావంత్

మోడి మరోసారి ప్రధాని కావాలని ప్రజలందరూ సంకల్పించారు: గోవా సీఎం డా. ప్రమోద్ సావంత్

భువనగిరి ఖిల్లా సాక్షిగా తెలంగాణ కోసం కోట్లాడినం: ఈటెల రాజేందర్
ఘనంగా బిజెపి విజయసంకల్ప యాత్ర ప్రారంభం
ముద్ర ప్రతినిధి భువనగిరి :
మోడి మరోసారి ప్రధాని కావాలని ప్రజలందరూ సంకల్పించారని గోవా సీఎం డా. ప్రమోద్ సావంత్ అన్నారు. 
 మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బిజెపి విజయసంకల్పయాత్ర ప్రారంభ సభలో ఆయన హాజరై మాట్లాడుతూ 140 కోట్ల భారత ప్రజల ముద్దుబిడ్డ మోదీ  మరోసారి ప్రధాని కావాలని 
ఈసారి యువత, మహిళలు అంతా మోడీకే ఓటు వేయాలని నిచ్చయించుకున్నారని చెప్పారు. తెలంగాణలో 10 సీట్లు గెలవడం ఖాయమన్నారు. అయోధ్య రామమందరం తిరిగి నిర్మించి 500 ఏళ్ల క్రితం కూలిన భారతజాతి విశ్వాసాన్ని నిలబెట్టారు కాబట్టే దేశప్రజలందరూ జై శ్రీరాం, జై మోదీ అంటున్నారన్నారు. ఈటల రాజేందర్ మాట్లాడుతూ భువనగిరి ఖిల్లా సాక్షిగా తెలంగాణ కోసం కోట్లాడినం. సాదించుకున్నామన్నారు. ఈ ఎన్నికల్లో BRS కి ఓట్లు వేస్తే వృధా అన్నారు. దేశమంతా భిన్న సంస్కృతులు, భిన్న ప్రజలు ఉన్నా అందరూ మా మోదీ అని గర్వంగా చెప్పుకుంటున్నారని చెప్పారు.
మోదీ వచ్చాక ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేను భారతీయుని అంటే గౌరవం పెరిగిందని గొప్పగా చెప్పుకుంటున్నారని, 
అబ్దుల్ కలాం రాష్ట్రపతి హోదాలో అమెరికా పోతే బూట్లు విప్పి చెక్ చేసి అవమానించారని కానీ ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ భుజంమీద చేయివేసి మాట్లాడే సత్తా మన మోడీ సంపాదించుకున్నారన్నారు. 
పదవివచ్చాక గతం మర్చిపోతారు కాని చాయ్ అమ్ముకున్న స్థాయి నుండి వచ్చాను అని గర్వంగా చెప్పుకొనే బిడ్డ మోదీ అన్నారు. 
కష్టాలు తెలిసిన బిడ్డ కాబట్టే 12 కోట్ల టాయిలెట్ నిర్మించి ఆడబిడ్డల ఆత్మగౌరవం కాపాడిన బిడ్డ మోదీ అన్నారు.
కరోనా వస్తే మోదీ కన్నీళ్లు పెట్టలేదు 
ధైర్యం ఇచ్చి కాపాడి 
ప్రపంచానికి వాక్సిన్ అందించారని చెప్పారు.


 మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ 5 వ ఆర్ధిక శక్తిగా ఎదిగి మూడవ స్థానం తీసుకురావాలి అనేది మోదీ సంకల్పమన్నారు.
మన ఎలక్ట్రానిక్ వస్తువులు మనదేశంలోనే ఉత్పత్తి చేసుకునే స్థాయికి ఎదిగినం. ఇప్పుడు అంతా మేడ్ ఇన్ ఇండియా అయిందన్నారు.
కుటుంబాన్ని ముందు పెట్టడం వల్లనే జాతిపిత అవుదామనుకున్న  కేసీఆర్ 10 ఏళ్లకే ఖతం అయ్యిండన్నారు.
నాకు కుటుంబం లేదు 140 కోట్ల మంది నా కుటుంబం అని చెప్పుకునే వ్యక్తి నరేంద్ర మోదీ 
ఈశఖం మోదీ శఖం అన్నారు.
బీజేపీ వస్తే కమ్యూనల్ దేశం అవుతుంది అన్నారు. 


కాలేదు సరికదా.. ట్రిపుల్ తలాక్ రద్దుతో ముస్లిం మహిళల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న వ్యక్తి అన్నారు. కాంగ్రెస్ హామీలపై ఇప్పుడే విమర్శించను.. కానీ మీ హామీలు అమలు చేయకపోతే వదిలిపెట్టేది లేదన్నారు. సురక్షితంగా..  సుభిక్షంగా.. ఆత్మగౌరవంతో గల్లా ఎగురవేసుకొని బ్రతకాలి అంటే నరేంద్ర మోదీకి ఓటు వేసి గెలిపించాలి అని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, ప్రకాశ్ రెడ్డి, వర్షిత్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, నాయకులు పడమటి జగన్మోహన్ రెడ్డి, పడాల శ్రీనివాస్, ఉమా శంకర్, రత్నపురం బలరాం, రత్నపురం శ్రీశైలం, ఉడుత భాస్కర్, జనగాం నరసింహ చారి పాల్గొన్నారు.