అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు

అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
  • అబ్బుర పరిచిన చిన్నారుల ప్రదర్శనలు
  • కనువిందు చేసిన రంగవల్లులు
  • అతిథిగా హాజరైన ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సతీమణి శివాని రెడ్డి

ముద్ర ప్రతిధి, మెదక్:మెదక్ ఎమ్మెల్యే డా. మైనంపల్లి రోహిత్ సతీమణి శివానిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. పాఠశాల చైర్మన్ శ్రీనివాస్ చౌదరి, ప్రిన్సిపాల్, మాచవరం సర్పంచ్ సంధ్యారాణిల పర్యవేక్షణలో సిద్దార్థ్ పాఠశాల ఆవరణలో గురువారం రంగవల్లి పోటీలు నిర్వహించగా 150 మంది మహిళలు పాల్గొని తమ ప్రతిభ చాటారరు. శివాని రెడ్డి జ్యోతిప్రజ్వలన చేసి సంబరాలు ప్రారంభించారు.  మహిళలు వేసిన ముగ్గులు అందరిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా బోగి మంటలు, చిన్నారులకు బోగి పండ్ల కార్యక్రమం ఆకట్టుకుంది.  విద్యార్థిని విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బుర పరిచాయి.

విజేతలు వీరే

ముగ్గుల పోటీలో భాగంగా మొదటి బహుమతి అవంతి(రామాయంపేట), రెండవ బహుమతి మాలతి(మెదక్), మూడవ బహుమతిగా వారణాసి సౌమ్య(మెదక్), పి. సౌమ్య, శిరిషలు గెలుచుకున్నారు. పాల్గొన్న వారికి కన్సొలేషన్ బహుమతులు శివాని రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో పాపన్నపేట ఎంపిపి చందనా ప్రశాంత్ రెడ్డి, కౌన్సిలర్ లు దొంతి లక్ష్మి ముత్యంగౌడ్, ఆవారి శేఖర్, దాయర లింగం,  పట్టణ అధ్యక్షులు గూడూరి ఆంజనేయులు, మాజీ కౌన్సిలర్ లు కొండన్ సురేందర్ గౌడ్,బట్టి సులోచన, జ్యోతి, హరిత, కీర్తి రితీష్, నాయకులు బొజ్జ పవన్, ఉప్పల రాజేశ్, డా. పవన్, భూపతి, హరిత, గూడూరి శంకర్ గౌడ్, పిల్లికొట్టాల్ నాగరాజు, సంగమేశ్వర్, సాయి, రమేశ్, దేవుల తదితరులు పాల్గోన్నారు.