ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కు సన్మానం.
మోత్కూర్(ముద్ర న్యూస్): ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ నాగరిగారి ప్రీతం ను మోత్కూర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్మన్ నాగారిగారి ప్రీతం మాట్లాడుతూ నాకు నా నియామకానికి సహకరించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు నేను మోత్కూర్ ప్రాంతావాసిని నాకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,మంత్రులు అందరికి ధన్యవాదాలు తెలుపారు. మీ అందరి సంక్షేమం కోసం ముందు ఉండి పనిచేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా నాయకులు అవిశెట్టి అవిలిమల్లు, డాక్టర్ వెంకటేశ్వర్లు (తేజ), బి సి యువజన సంఘం జాతీయ అధ్యక్షులు గడ్డం నరసింహ, మండల నాయకులు కూరేళ్ల ఉప్పలయ్య, గనగాని నర్సింహ, బుంగపట్ల యాకయ్య, చిర్రాబోయిన కొమురయ్య, ఎవరెస్టు యూత్ అధ్యక్షులు బాలెంల మధు, యువజన సంఘం మండల అధ్యక్షుడు అవిశెట్టి కిరణ్, మైనార్టీ రాష్ట్ర నాయకులు ఎండి ఆయాజ్ తదితరులు పాల్గొన్నారు