తెలంగాణ లో రాక్షస పాలన, అవినీతి నడుస్తుందనీ లక్షలాది తెలంగాణ యువకుల బతుకులు నిరుద్యోగులమిగిలిపోయారు - మాజీ మంత్రి జూపల్లి కృష్ణ రావు

తెలంగాణ లో రాక్షస పాలన, అవినీతి నడుస్తుందనీ లక్షలాది తెలంగాణ యువకుల బతుకులు నిరుద్యోగులమిగిలిపోయారు - మాజీ మంత్రి జూపల్లి కృష్ణ రావు

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో  ఈనెల 20న  పాలమూరు ప్రజాబేరి సభ  ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించిన అనంతరం మొట్టన మొదటిసారిగా నాగర్ కర్నూల్ జిల్లాకి రావడంతో ఆయనకి కాంగ్రెస్ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కొల్లాపూర్ చౌరస్తా నుండి నాగర్ కర్నూల్ కి భారీ కార్ల ర్యాలీగా వచ్చారు ఆయనకి ఎమ్మెల్సీ కుచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ రెడ్డి స్వాగతం పలికారు.

ఈ  సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 9 ఏళ్లగా అవినీతి , రాక్షస పాలన నడుస్తుందనీ,  లక్షలాది తెలంగాణ యువకుల బతుకులు నిరుద్యోగుల మిగిలిపోయారనీ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజానీకనీ  రాష్ట్ర  బిఆర్ఎస్ పార్టీ పాలిచ్చే నైతిక హర్హత కోల్పోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం  ఒక్క క్షణం కూడా అధికారంలో వుండే పరిస్థితి లేదన్నారు.  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వకపోతే వీళ్ళ బతుకులు ఎక్కడ ...? వేండేవి అని ప్రశ్నించారు. అవినీతి పలనాపోవలి అంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనీ  , తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అధికార బహుమతి ఇవ్వాలనీ రాష్ట్ర ప్రజలను కోరారు.