మల్లిఖార్జున్ ఖర్గేకు వీడ్కోలు పలికిన నేతలు

మల్లిఖార్జున్ ఖర్గేకు వీడ్కోలు పలికిన నేతలు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కు జిల్లా, రాష్ట్ర శ్రేణులు శనివారం ఉదయం ఘనంగా వీడ్కోలు పలికారు. మంచిర్యాల శివారు నస్పూర్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన సత్యా గ్రహ దీక్ష సభలో మల్లిఖార్జున్ ఖర్గే పాల్గొన్నారు. రాత్రి సీసీసీ అతిధి గృహంలో బస చేశారు. ఉదయం మంచిర్యాల డిగ్రీ కాలేజ్ క్రీడా మైదానంలో ఉన్న హెలికాప్టర్ లో హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. ఆయనతో పాటు తెలంగాణ  రాష్ట్ర ఇంచార్జి మానిక్ రావు కూడా వెళ్లారు.  పీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సంపత్, మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ఇతర నేతలు వీడ్కోలు పలికారు.