కొల్లాపూర్ లో ప్రజాఆశీర్వాద సభను విజయవంతం చేద్దాం - గౌరారం వెంకటరెడ్డి

కొల్లాపూర్ లో ప్రజాఆశీర్వాద సభను విజయవంతం చేద్దాం - గౌరారం వెంకటరెడ్డి

ముద్ర. వీపనగండ్ల: కొల్లాపూర్ లో నవంబర్ 19 న నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కొల్లాపూర్ నియోజక వర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గౌరారం వెంకటరెడ్డి అన్నారు.మండల కేంద్రమైన వీపనగండ్ల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో గౌరారం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ నవంబర్ 19 ఆదివారం రోజు  మధ్యాహ్నం 1 గంటకు ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యఅతిథిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్నారని ఆ సభను విజయవంతం చేయవలసిన బాధ్యత నాయకులు, కార్యకర్తలు,రైతులు,మహిళలు అభిమానులు,అందరిపై ఉందన్నారు.బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ బహిరంగ సభను విజయవంతం చేయడానికి జన సమీకరణ చేసుకుంటూ ఎన్నికల్లో బిఆర్ఎస్ గెలుపు లక్ష్యంగా గట్టి పట్టుదలతో పనిచేయాలని కోరారు.అనంతరం బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డిని ఎన్నికల్లో గెలిపించాలని ఇంటింటా ప్రచారం నిర్వహించారు.రాష్ట్రంలో ఇప్పుడు అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమం ఇంతకు రెట్టింపుతో అమలు కావాలంటే కేసీఆర్‌ గెలవాలని,కేసీఆర్‌ గెలవాలంటే కారు గుర్తు మీద ఓటు వేయాలని అన్నారు. రాష్ర్టంలో భారస ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌, కేసీఆర్‌ ఆరోగ్య బీమా, సౌభాగ్యలక్ష్మి పేరుతో అర్హులైన మహిళలకు నెలకు రూ.3 వేలు, దసలవారీగా ఆసరా పింఛన్ల పెంపు, ఐదు లక్షల కేసీఆర్ బీమా, స్వశక్తి మహిళా గ్రూపులకు భవనాలు, రేషన్ దుకాణాల ద్వారా సన్న బియ్యం వంటి పథకాలను అందించడం జరుగుతుందని ఓటర్లకు వివరించారు.కార్యక్రమంలో  ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు ముంత మల్లయ్య యాదవ్, కొల్లాపూర్ మార్కెట్ యార్డు కమిటీ డైరెక్టర్ చాపల సాయిబాబా, నాయకులు ఎత్తం బాలస్వామి, కరుణాకర్ రెడ్డి,రజాక్,ముంత శివ యాదవ్,ఎర్ర వెంకటయ్య, సంగం వెంకటయ్య,జోల్లు నారాయణ, అయ్యన్న,వీర బాబు, శేఖర్ తదితరులు ఉన్నారు.