మన ఊరు మన బడి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్
![మన ఊరు మన బడి పనులు త్వరితగతిన పూర్తి చేయాలి: కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్](https://mudranews.in/uploads/images/2023/02/image_750x_63dd0cd9bca19.jpg)
ముద్ర, వనపర్తి ప్రతినిధి: జిల్లాలో మన ఊరు మనబడి కార్యక్రమంలో చేపట్టిన పాఠశాలల పనులను త్వరితగతను పూర్తి చేసేందుకు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ అన్నారు. శుక్రవారం మన ఊరు మనబడి కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తి అయిన పాఠశాలల వివరాలు తెలుసుకున్నారు. పాఠశాలలో బెంచీలు, బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తెలపాలని ఆదేశించారు.
ఉపాధి హామీ కింద చేపట్టిన పాఠశాలల పనులు ఎంతవరకు వచ్చాయని ఆయన వివరాల అడిగి తెలుసుకున్నారు. మంజూరైన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వాటిపై పూర్తి నివేదిక అందజేయాలని, పాఠశాలల పెండింగ్ పనులు, ఇతర పనులను ఆలస్యం చేయకుండా సత్వారం పూర్తి చేయాలని ఆదేశించారు. మార్చి 31 నాటికి జిల్లాలో 150 పాఠశాలల పనులు పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. రూపాయలు 30 లక్షల లోపు. 30 లక్షల పైబడిన పాఠశాలల నిర్మాణాల గురించి తెలుసుకున్నారు . పాఠశాలల్లో చెట్లు పెంచి గ్రీనరీ పెంచాలన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఈ ఈ, డి ఎఫ్ ఓ పాల్గొన్నారు.