మంథని, రామగిరి బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ లోకి
కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన దుద్ధిళ్ళ శ్రీధర్ బాబు
ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి: మంథని, రామగిరి మండలాలకు చెందిన దాదాపు 150 మంది బీఆర్ఎస్ నాయకులు సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన 50 మంది యువకులకు కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమక్షంలో పార్టీలో చేరగా, వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి శ్రీధర్ బాబు ఆహ్వానించారు.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు రొడ్డ బాబు సీనియర్ నాయకులు వనం రాంచందర్ రావు, తొట్ల మధునయ్య, బండారి సదానందం, యూత్ కాంగ్రెస్ నాయకుడు బర్ల శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
లక్కేపూర్ లో హమాలి సంఘం నాయకులు చేరిక
మంథని మండలం లక్కేపూర్.గ్రామానికి చెందిన. లక్కేపూర్. అమాలిసంఘం. నాంపల్లి కొమురయ్య లక్కేపూర్ 1వార్డ్ మెంబర్ అమాలి సంఘం అధ్యక్షులు మాజీ అధ్యక్షులు బందెల లింగయ్య. నక్క చంద్రయ్య. బడికల కృష్ణస్వామి. కాసిపేట రమేష్. కొంతం సంతోష్. ఏరువ చందు. ఏరువ రమేష్. కోడూరు రామస్వామి. గుంజపడుగు లచ్చయ్య. మంథని మల్లేష్, ఏరువ కొమురయ్య, బీఆర్ఎస్ పార్టీకి నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి శ్రీధర్ బాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
మంథని ఆటో యూనియన్ నాయకులు చేరిక
మంథని మున్సిపల్ కి చెందిన ఆటో యూనియన్ మాజీ అధ్యక్షుడు తుంగల శ్రీనివాస్, యూనియన్ నాయకులు పుప్పాల శేఖర్, శ్యామల రమేష్, ఎండి సర్వర్, శంకర్, సమ్మయ్య బీఆర్ఎస్ పార్టీకి నుండి కాంగ్రెస్ పార్టీ లో చేరారు. వారికి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంథని ఎంపీపీ కొండ శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఐలి ప్రసాద్, సీనియర్ నాయకులు ముస్కుల సురేందర్ రెడ్డి, నాయకులు పర్వతాలు యాదవ్, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.