మృతుల కుటుంబాలకు  మంత్రి హరీష్ రావు పరామర్శ

మృతుల కుటుంబాలకు  మంత్రి హరీష్ రావు పరామర్శ

ముద్ర ప్రతినిధి , సిద్దిపేట:-సిద్ధిపేట పట్టణము లోని ఇరువురి కుటుంబాలను రాష్ట్ర ఆర్థిక,వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించారు. ఆదివారం ఉదయం హౌసింగ్ బోర్డులోని ప్రముఖ హోటల్ వ్యాపారి నర్సింహారెడ్డి తల్లి ఇటీవల మృతి చెందారు.ఈ మేరకు విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు వారి కుటుంబాన్ని పరామర్శించారు.అనంతరం పట్టణ శివాజీ నగర్ లోని ప్రముఖ వైన్ షాప్ యజమాని రాచకొండ రాజమల్లయ్య గౌడ్ ఇటీవల మృతి చెందారు.ఈ విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్ రావు వారి కుటుంబాన్ని పరామర్శించారు.