పల్లె దవాఖానను సందర్శించిన ఎమ్మెల్సీ శేరి

పల్లె దవాఖానను సందర్శించిన ఎమ్మెల్సీ శేరి
  • వైద్య అధికారులపై ఆగ్రహం
  • సీసీ రోడ్డు పనులు ప్రారంభం

ముద్ర ప్రతినిధి, మెదక్: హవేలి ఘనపూర్ మండల కేంద్రంలో తన నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సిడిపి) నుంచి మంజూరైన 10 లక్షల రూపాయల సిసి రోడ్ పనులను ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి ప్రారంభించారు.  అనంతరం స్థానిక సర్పంచ్ నోముల సవిత శ్రీకాంత్ తో కలిసి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

ప్రభుత్వ వైద్యశాల పల్లె దావఖానను సందర్శించి అక్కడ సిబ్బంది పనితీరును గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం కోట్ల ఖర్చు చేసి పల్లె దావకానాలను అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరిస్తే గ్రామాలలోని ప్రజలు ఆర్ఎంపీల వద్దకు ఎందుకు వెళ్తున్నారని ఎమ్మెల్సీ అక్కడ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ పనిచేస్తున్న మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఉద్యోగి విధులకు హాజరు కాకపోవడంపై ఎమ్మెల్సీ అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా వైద్యశాఖ అధికారి చందు నాయక్ తో ఫోన్లో మాట్లాడారు. ఇక్కడికి వస్తున్న రోగులకు సరైన వైద్యం అందిస్తే వాళ్లు ఆర్ఎంపీల వద్దకు ఎందుకు వెళ్తారని డిఎంహెచ్వోను ఎమ్మెల్సీ ప్రశ్నించారు. పల్లె దవఖానాలు ఉన్నచోట అయినా రోగులు ఆర్ఎంపీల వద్దకు వెళ్లకుండా వారికి అవసరమైన వైద్యం అందించాలని సూచించారు.   ఎక్కువగా రోగులు సందర్శిస్తున్న పల్లె దవఖానాలను అప్ గ్రేడ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని  జిల్లా వైద్య శాఖ అధికారికి ఎమ్మెల్సీ సూచించారు. ఈ పల్లె దవఖాన మొత్తంలో ఎక్కడా ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటో కనిపించకపోవడంపై అక్కడ సిబ్బందిపై, డిఎంహెచ్ఓపై ఎమ్మెల్సీ అసహనం వ్యక్తం చేశారు. సిబ్బంది విధులకు గైర్హాజరు కావడంపై చర్యలు తీసుకోవాలని  డిఎంహెచ్ఓకు ఎమ్మెల్సీ సూచించారు.

అనంతరం హవేలీ ఘనపూర్ గ్రామానికి చెందిన ఇటీవల ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించిన పార్టీ సీనియర్ కార్యకర్త మూగ ఏసురాజు ఇంటికి వెళ్లి  కుటుంబాన్ని ఎమ్మెల్సీ పరామర్శించారు. కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి ధైర్యం చెప్పారు. బాధితుడి భార్యకు ప్రభుత్వం తరఫున ఏదైనా ప్రత్యామ్నాయ ఉపాధి ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. వెంట సర్పంచ్ నోముల సవిత శ్రీకాంత్, సర్పంచులు మహిపాల్ రెడ్డి, మన్నె లక్ష్మీనారాయణ, యామిరెడ్డి, రాజేందర్ రెడ్డి, శీను నాయక్, నాయకులు సాయ గౌడ్, చిట్యాల శ్రీనివాస్, మండల కోప్షన్ సభ్యుడు ఖాలేద్, స్థానిక ఉపసర్పంచ్ మోహన్ గౌడ్, వార్డు సభ్యుడు నాగరాజు, పార్టీ నాయకులు ప్రతాపరెడ్డి, నవీన్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, లక్ష్మయ్య, గణపతి, శ్రావణ్, శ్రీను, రామ్, అభిరామ్, అశోక్ ఎంపీడీవో శ్రీరామ్, పంచాయతీ రాజ్ డిప్యూటీ ఈఈ పాండురంగారెడ్డి వివిధ శాఖల అధికారులు ఉన్నారు.