టీఎస్పీఎస్సీ పేపర్లీక్ కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు
టీఎస్పీఎస్సీ పేపర్లీక్ కేసులో కొనసాగుతున్న సిట్ దర్యాప్తు. డీఏవో పరీక్ష టాప్ స్కోరర్లు రాహుల్, శాంతి, సుచరితను విచారిస్తున్న సిట్ అధికారులు. నిందితులను మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. చంచల్గూడ జైలు నుంచి నిందితులను కస్టడీకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఇప్పటికీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ వ్యవహారం ఒక కొలిక్కి రాలేదు. కస్టోడియన్ శంకర్ లక్ష్మిపై అనుమానాలు బలపడుతున్నాయి. ఇప్పటివరకు సిట్ ఆమెను సాక్షిగా పరిగణించింది. ఇప్పటివరకు సిట్ 37 మందిని అరెస్టు చేసింది.