పిఎస్, శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్

పిఎస్, శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కేటీఆర్

ముద్ర, తెలంగాణ బ్యూరో: తన ప్రవేట్ సెక్రటరీ (పిఎస్) కానుగుల శ్రీనివాస్ కుటుంబాన్ని శనివారం మంత్రి కేటీఆర్  పరామర్శించారు. శ్రీనివాస్ తల్లి  కానుగుల రాములమ్మ గత నెల 18వ తేదీన మరణించారు.  ఆ సమయంలో ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో  హయత్ నగర్ లో ఉంటున్న శ్రీనివాస్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు.

రాములమ్మ  చిత్రపటానికి నివాళి అర్పించిన కేటీఆర్, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఆ తర్వాత శ్రీనివాస్ కుటుంబ సభ్యుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారికి తన ప్రగాడ సానుభూతి తెలియజేశారు. మంత్రి కేటీఆర్ వెంట ఎల్బీనగర్ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, టిఎస్ రెడ్కో ఛైర్మన్ వై. సతీష్ రెడ్డిలు కూడా ఉన్నారు.