వినాయక చవితి కమిటీ మెంబర్ లకు పోలీస్ శాఖ  అనుమతి తప్పనిసరి

వినాయక చవితి కమిటీ మెంబర్ లకు పోలీస్ శాఖ  అనుమతి తప్పనిసరి

వినాయక చవితి సందర్భంగా పోలీస్ శాఖ పర్మిషన్ తీసుకోవాలి - చివ్వెంల ఎస్ ఐ పి. విష్ణు

ముద్ర, చివ్వెంల: వినాయక చవితి కమిటీ మెంబర్ లకు పోలీస్ శాఖ  అనుమతి తప్పనిసరి చివ్వెంల ఎస్ ఐ పి. విష్ణు అన్నారు. బుధవారం ఒక ప్రకటన విడుదల చేసినారు. అనంతరం మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ప్రతిష్టించదలచిన  18.09.23 న వినాయక చవితి పర్వదినాన్ని పురష్కరించుకుని  మండలం లో పందిళ్ళు,మండపాలు ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలు ప్రతిష్టించి ఉత్సవాలు నిర్వహించదలచిన వారు తప్పని సరిగా ముందస్తు ఆన్లైన్ లో అప్లై చేసి పోలీసు అనుమతి పొందాలి, నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించి ప్రశాంత వాతావరణంలో పండగ జరుపుకోవాలని, వినాయక చవితి సందర్భంగా మండపం వద్ద పాటించవలసిన నియమ నిబంధనలు, తీసుకోవాలని వినాయక విగ్రహ ప్రతిష్ఠ పందిళ్ళు,మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి  5 లేదా అంతకంటే ఎక్కువ మంది కమిటీగా ఏర్పడి  వివరాలు పోలీస్ స్టేషన్ లలో ఆన్లైన్ లో అనుమతి కొరకు అప్లై చేసుకోవలెను, ప్రైవేట్ లేదా పంచాయతీ /మున్సిపాలిటీ కి సంబంధించిన స్థలాలలో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయదలచిన ముందుగా సదరు ప్రవేటు స్థలమైతే స్థల యజమాని అనుమతి, ప్రభుత్వ స్థలమైతే  పంచాయతీ లేదా మున్సిపాలిటీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి, వారితోపాటు చుట్టుపక్కల నివసించే వారి సమ్మతి కుడా అవసరం. ఫైర్, విద్యుత్ శాఖల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి వారు సూచించిన నియమ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి పందిళ్ళు/మండపాలు వద్ద ఇసుక మరియు నీళ్ళను ఏర్పాటు చేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి మండపాలలో దీపారాధనల వలన అగ్నిప్రమాదాలు జరుగకుండా జాగ్రతలు తీసుకోవాలి. విద్యుత్ వైర్లను మరియు ప్రకాశవంతమైన లైట్ల వినియోగంలో జాగ్రతలు వహించాలి. ఎలక్ట్రిక్ షార్ట్ సర్య్కూట్ జరుగకుండా వైరింగ్ జాగ్రత్తగా చేయించుకోవాలి.

విగ్రహాల ఎత్తు, బరువు, ఉత్సవం నిర్వహించే రోజుల సంఖ్య, నిమజ్జనం చేసే తేదీ, సమయం, నిమజ్జన మార్గం మరియు విగ్రహ నిమజ్జనానికి ఉపయోగించే వాహన వివరాలను విధిగా తెలియజేయాలి, పందిళ్ళు/మండపాలు వద్ద శబ్ధకాలుష్య క్రమబద్దీకరణ, నియంత్రణ నింబంధనలు-2000 ప్రకారం రెసిడెన్సియల్ ఏరియా నందు పగలు 55, రాత్రి 45 డెసిబల్స్ కు మించకుండా ఉండే విధంగా స్పీకర్లను ఉపయోగించాలి. ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలి.

డి.జే ల కు అనుమతి లేదు
భద్రత కొరకు రాత్రి సమయాల్లో మండపాల వద్ద విధిగా ఆర్గనైజింగ్ కమిటీ వారి ప్రతినిధులు కాపలా ఉండవలెను. ఎవరికి వారు తగు భద్రతా ఏర్పాట్లు చేసుకొనవలెను. రాత్రి సమయాలలో పందిళ్ళు/మండపాలు లో డబ్బులు, బంగారం లాంటి విలువైన వస్తువులు ఉంచరాదు. విగ్రహం పెట్టే ప్రదేశం గాని రోడ్డుపైన ఉండరాదు. బ్యానర్లు కాని, ప్లెక్సీలు గాని రోడ్డుపైన రాకపోకలకు అంతరాయంగా పెట్టరాదు. ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దు. ఊరేగింపు సమయంలో ఇతర కులాలు, మతాలకు వ్యతిరేకంగా నినాదాలు  చేయరాదు.నిమర్జన ఊరేగింపుకు  అనుమతించిన సమయం, నిమర్జన కు కేటాయించిన ప్రదేశం మరియు ఊరేగింపునకు కేటాయించిన మార్గము లాంటి నిబంధనలు ఖచ్చితంగా పాటించవలెను.

నిమజ్జనానికి వెళ్లే వాహనం పై మద్యం  లేదా మత్తు పదార్ధాలను సేవించిన, మైనర్ లు ఉండరాదు.వినాయక ఉత్సవ కమిటీ మెంబర్లు నిమజ్జనానికి ఉపయోగించే వాహనం యొక్క పరిస్థితిని గమనించి మంచి కండిషన్లో ఉండే బండిని మరియు లైసెన్స్ ఉన్న మరియు అనుభవం ఉన్న డ్రైవర్లను ఉపయోగించండి.గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్లకు విజ్ఞప్తి మీరు గణేష్ నిమజ్జనానికి వెళ్లేటప్పుడు మీ యొక్క విగ్రహం నిమజ్జనానికి చిన్న పిల్లలను తీసుకెళ్లకండి.

ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ ఇబ్బంది కలుగకుండా రద్దీని నివారించేందుకు మరియు భద్రత కొరకు తగినంత మంది వాలంటీర్లను ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసుకోవాలి.ఏదైనా అవాంఛనీయ సంఘటనలో తలెత్తితే పూర్తి బాధ్యత నిర్వాహకులు లేదా కమిటీ సభ్యుల పైన ఉంటుంది, కావున వినాయక విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులే తగిన భద్రతా ఏర్పాట్లు చూసుకోవాలి, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే అవకాశం ఉంటే ముందుగానే సంబంధిత పోలీస్ అధికారులకు తెలియపరచాలి.
policeportal tspolice.gov.in/index.htm   ఈ వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలని తెలిపారు.