ప్రభుత్వ న్యాయవాది గా నియమితులైన గుడిపూరి వెంకటేశ్వర్ రావు కు ఘన సన్మానం - బిషప్ దుర్గం ప్రభాకర్

ప్రభుత్వ న్యాయవాది గా నియమితులైన గుడిపూరి వెంకటేశ్వర్ రావు కు ఘన సన్మానం - బిషప్ దుర్గం ప్రభాకర్

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: సూర్యాపేట పట్టణ కేంద్రం లోని విద్యా నగర్ నందు గుడిపూరి వెంకటేశ్వర్ రావు నివాసం లో ఆయన ను కలిసి ఇటీవల కాలంలో  ప్రభుత్వ న్యాయవాది గా  గుడిపురి వెంకటేశ్వర్ రావు నియమితులైన సందర్బంగా వారికీ శాలువా, పూలమాల తో, స్విట్స్ అందించి ఘనంగా సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ కమిటీ తరుపున వారిని సత్కరించారు. ఈ సందర్బంగా సూర్యాపేట జిల్లా పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బిషప్ దుర్గం ప్రభాకర్ మాట్లాడుతూ సీనియర్ న్యాయవాది, నిగర్వి, స్నేహశిలీ, మృదుస్వభావి, అన్నీ సామాజిక వర్గాల మన్ననలు పొందిన వ్యక్తి , గత 36 సంవత్సరాలనుండి ప్రజలకు సేవలందించి గొప్ప పేరు తెచ్చుకున్నారని, వారికీ పి . పి.గా ప్రభుత్వం నియమించడం పట్ల వారికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా చార్లెట్ హోం వ్యవస్థాపకులు జాటోత్ డేవిడ్ రాజు ప్రత్యేక ప్రార్ధన చేశారు, ఈ కార్యక్రమం లో చివ్వేంల మండలం పాస్టర్స్ అధ్యక్షులు గుగులోత్ బాలాజీ నాయక్, సూర్యాపేట రూరల్ అధ్యక్షులు యల్క ప్రభాకర్, ఆత్మకూర్ యస్ సీనియర్ పాస్టర్ జలగం జేమ్స్, పంది మార్క్,చెట్టుపల్లి దేవయ్య,బానోత్ సుధాకర్, దారావత్ సాంసన్ నాయక్, శ్యాగ యాకోబు, కొమ్ము హోసన్నా తదితరులు పాల్గొన్నారు