మార్చి 6న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణప్రతిష్ట

మార్చి 6న స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాణప్రతిష్ట
  •  నూతన ఆలయ ప్రాంగణంలో పంచముఖ పూజాకార్యక్రమాలు
  • స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు ప్రారంభించిన మానేపల్లి కుటుంబ సభ్యులు

ముద్ర ప్రతినిధి భువనగిరి : భువనగిరి పట్టణ శివారులోని మానేపల్లి హీల్స్ పై మానేపల్లి దంపతులు రామారావు విజయలక్ష్మి సారథ్యంలో నిర్మించిన స్వర్ణగిరి పద్మావతి, గోదా దేవీ సమేత వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ ప్రాణ ప్రతిష్ఠ ఆలయ ఉత్సవాల  కోసం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసినట్లు మానేపల్లి హిల్స్ అధినేత మానేపల్లి రామారావు వారి కుమారులు మానే పల్లి మురళి కృష్ణ, గోపి కృష్ణ తెలిపారు. ఈ నెల 1 నుంచి 6 వరకు ఆరు రోజుల పాటు ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నట్లు  తెలిపారు. ఈ నెల 6 వేంకటేశ్వర స్వామి నూతన ఆలయ విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం 11గంటల 06 నిమిషాలకు జరిపించి అనంతరం శాంతి కళ్యాణంతో కార్యక్రమాలు సుసంపన్నము కానున్నట్లు వారు తెలిపారు, భువనగిరి పట్టణానికి కూత వేటు దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి అని నామకరణం చేసి తెలంగాణా తిరుపతిగా తీర్చిదిద్దేందుకు అందరి సహాయ సహకారాలు కావాలని కోరారు.

భువనగిరి మున్సిపల్ పట్టణ శివారులోని మానేపల్లి హీల్స్ పై నిర్మించిన స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి నూతన ఆలయ ప్రాణ ప్రతిష్టాపన కార్యక్రమం సందర్భంగా ముందు రోజు ఆలయంలో పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా మానేపల్లి హీల్స్ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ. పరమహంస పరివ్రాజకులు, ఉభయవేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ శ్రీ శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి మంగళాశాసనములతో 22 ఎకరాల ప్రాంగణం లో “స్వర్ణగిరి” అని నామకరణం గావించబడిన కొండ మీద శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీ పాంచరాత్ర ఆగమ, తెన్నాచార్య సంప్రదాయమును అనుసరిస్తూ, ప్రాచీన శిల్ప శాస్త్ర రీతులను అవలంబిస్తూ సువిశాలముగా “యాదాద్రి తిరుమల దేవస్థానం” పేరుతో రూపుదిద్దుకున్నట్లు తెలిపారు‌ పల్లవ, విజయ నగర, చోళ , చాళుక్య శిల్ప రీతులతో, ప్రాకారానికి నాలుగు వైపులా నాలుగు రాజగోపురాలతో, సువిశాలమైన మండపాలతో, 5 అంతస్తుల విమాన గోపురం తో కూడిన గర్భాలయంలో, సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వేంకటేశ్వర స్వామివారు కొలువైన ఈ క్షేత్రమ్ తెలంగాణలోని అతిపెద్ద శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం గా చెప్పుకోవచ్చని అన్నారు.

శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతి దేవి, శ్రీ గోదా దేవి, శ్రీ మదన గోపాల కృష్ణ స్వామి, శ్రీ గరుడాల్వార్, శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మింపబడిన్నట్లు తెలిపారు. దేవాలయ ఆవరణలో మనోభీష్ట ఫలకం ప్రత్యేక ఆకర్షణ, భక్తుల విన్నపాలు దీని ద్వార స్వామివారికి అనుసందాన మవుతాయని తెలిపారు‌ బ్రహ్మోత్సవాల కనుగుణంగా విశాలమయిన మాడ వీదులతో, రథశాలతో పాటు 40 అడుగుల ఎత్తైన ఛూడ చక్కటి రథము రూపు దిద్దుకున్నట్లు పెర్కోన్నారు. అలాగే సుమారు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామి వారి దివ్య మూర్తి, శ్రీ లక్ష్మి నారసింహ స్వామి, శ్రీ భూ వరాహ స్వామి, వకులమాత, హంపి శిల్పరీతులతో నిర్మితమైన విశాలమైన పుష్కరిణి తోపాటు  నాలుగు వేదాలకు ప్రతీకలైన వేదమూర్తుల విగ్రహాలు, మధ్యలో పెద్ద జలనారాయణ మూర్తి ప్రతిష్టింప పడుతున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా సుమారు ఒకట్టిన్నర టన్నుల భారి కంచు గంట భక్తుల ప్రార్దన శ్రీవారికి చేరేందుకు భక్తులు మ్రోగించుటకై విజయ గంటను జయ గంటా మండపములో నెలకొల్ప పడిందని వివరించారు. కావున భక్తులు అందరూ విచ్చేసి, కార్యక్రమం లో పాల్గొని శ్రీవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించి శ్రీ వారి కృపకు పాత్రులు కా గలరని భక్తిపూర్వకంగా ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఈకార్యక్రమంలో మానెపల్లి హిల్స్ అధినేత మానేపల్లి రామారావు, మానేపల్లి మురళి కృష్ణ, మానేపల్లి గోపి కృష్ణ, ఆలయ రూపశిల్పి ప్రముఖ స్థపతి శ్రీమాన్ డిఎన్వి ప్రసాద్, వేద పండితులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.