దుబ్బాక పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ హెల్త్ 

దుబ్బాక పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ హెల్త్ 

సిద్దిపేట, ముద్ర ప్రతి నిధి : సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీసుల ఆధ్వర్యంలో 5కే అని జరిగింది. బుధవారం ఉదయం ఐదు గంటలకు మున్సిపల్ చైర్మన్ 5 కే రన్ జెండా ఊపి ప్రారంభించారు.  పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి హబ్సిపూర్ గ్రామం అంబేద్కర్ చౌరస్తా ఐదు కిలోమీటర్ల దూరం వరకు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో రన్ ఫర్ హెల్త్ అనే నిదానంతో ఈ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో దుబ్బాక సిఐ మున్నూరు కృష్ణ, ఎస్సై బత్తుల మహేందర్ ,పోలీస్ సిబ్బంది, వివిధ పాఠశాలల పిఈటిలు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.