బొందుగుల కుర్రారం గ్రామాలలో తెలంగాణ రైతంగా సాయుధ పోరాట వారోత్సవాలు

బొందుగుల కుర్రారం గ్రామాలలో తెలంగాణ రైతంగా సాయుధ పోరాట వారోత్సవాలు

రాజాపేట (ముద్రా) సెప్టెంబర్ 14 : గురువారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని బొందుగుల కుర్రారం గ్రామాలలో సంఘం నారాయణరెడ్డి పాశం రామ్ రెడ్డి గోపాల్ రెడ్డి వారి పోరాట త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి స్తూపాలకు పూలమాలలు అర్పించడం జరిగింది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వారోత్సవాలలో ఈ గ్రామాలలో వారిని గుర్తు చేసుకొని వారి బాటలో నడవాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కమ్యూనిస్టు పార్టీ జిల్లా నాయకుడు కొల్లూరి రాజయ్య మండల పార్టీ కార్యదర్శి చిగుళ్ల లింగం స్వామిగొల్లూరి రాములు కొత్త చంద్రకళ దోరగాల సత్తయ్య మూల పోశయ్య గ్రామ రైతు సంఘం నాయకుడు పుంజాల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.