కాంగ్రెస్ కు షాక్

కాంగ్రెస్ కు షాక్
  • బిఆర్ఎస్ లో చేరిన ముగ్గురు కాంగ్రెస్ ఎంపీటీసీ సభ్యులు

ముద్ర ప్రతినిధి, మెదక్:మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది.    ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి  బుధవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు ఎంపీటీసీ లతోపాటు 200 మంది కార్యకర్తలు బిఆర్ఎస్ లో చేరారు. చిన్న శంకరంపేట మండల పరిధిలోని  మిర్జాపల్లి ఎంపీటీసీ సభ్యురాలు  సక్కుబాయి మున్యా నాయక్, ధర్పల్లి ఎంపీటీసీ సభ్యురాలు రాధమ్మ ఆంజనేయులు, శేరిపల్లి ఎంపీటీసీ సభ్యురాలు సంతోష గొండ స్వామితో పాటు 200 మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు మెదక్  తరలివచ్చారు. వారికీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ...ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలకు సమ ప్రాధాన్యతనిస్తూ  సంక్షేమ పథకాలు అందిస్తున్నారన్నారు.  బిఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత  నియోజకవర్గం దినదినాభివృద్ధి చెందుతుందని చెప్పారు. పట్టణాల్లో, గ్రామాల్లో అంతర్గత, ప్రధాన రహదారులు ఎంతో అభివృద్ధి చెందాయని పేర్కొన్నారు. నియోజవర్గ అభివృద్ధిని ఆకాంక్షించి  పార్టీలో చేరడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో చిన్న శంకరంపేట మండల పార్టీ అధ్యక్షులు పట్లోరి రాజు, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.