ఘనంగా తెలంగాణ అమరవీరుల దినోత్సవం

ఘనంగా తెలంగాణ అమరవీరుల దినోత్సవం

తుంగతుర్తి ముద్ర: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో అమర వీరుడు శ్రీకాంతాచారి అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు తపించిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గుండ గాని కవిత డీసీసీబీ డీసీఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు వైస్ ఎంపీపీ మట్టపల్లి శ్రీశైలం ఎంపీడీవో భీమ్ సింగ్ లతోపాటు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.