అమరవీరుల త్యాగాలు మరువలేనివి. మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ

అమరవీరుల త్యాగాలు మరువలేనివి. మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ

మెట్‌పల్లి ముద్ర: తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పాటు కోసం తమ ప్రాణాలని పనంగా పెట్టిన అమరవీరుల త్యాగాలను మరువబోమని మున్సిపల్ చైర్ పర్సన్ రణవేణి సుజాత సత్యనారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశబ్ధి ఉత్సవాలలో భాగంగా అమరవీరుల సంస్మరణ దినోత్సవం వేడుకలను గురువారం పట్టణంలోని ఆరాపేట అమరవీరుల స్థూపం వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చం ఉంచి చైర్ పర్సన్ నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ సమావేశ మందిరంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో అమరులైన కుటుంబాలను గౌరవిస్తూ ఆదుకుంటున్నాడని. తెలంగాణ అమరుల త్యాగాలకు గుర్తుగా హైదరాబాద్ నడిబొడ్డున అతిపెద్ద స్థూపాన్ని ఏర్పాటు చేయించాడని తెలిపారు. మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, మేనేజర్ వెంకటలక్ష్మి, కౌన్సిలర్లు అంగడి పురుషోత్తం, బంగారుకళ్ళ కిషోర్, మన్నె గంగాధర్, ఒజ్జల బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.