సీఎంకు తప్పిన ముప్పు!
బెంగాల్: పశ్చిమ బెంగాల్సీఎం మమతా బెనర్జీకి తృటిలో ప్రాణాపాయం తప్పింది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్మంగళవారం వాతావరణం అనుకూలించక అననకూల పరిస్థితుల్లో సేవోక్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యింది. ఈ విషయాన్ని సీఎం అధికార వర్గాలు వెల్లడించాయి. సీఎం మమత జల్పాయ్గుడిలోని ఎన్నికల ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లనుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. సీఎం హెలికాప్టర్లో ప్రయాణిస్తుండగా బేంకూట్పూర్అటవీ ప్రాంతం వద్ద ఉండగా వాతావరణంలో మార్పు చోటు చేసుకుంది. ఉన్నట్టుండి ఆ ప్రాంతంలో భారీ వర్షం కురిసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ అధికార వర్గాలకు సమాచారం అందించి సురక్షితంగా ఎమర్జెన్సీ ల్యాండింగ్చేయడంతో అధికార యంత్రాంగం ఉపిరి పీల్చుకుంది. అనంతరం మమతా బెనర్జీ అటు నుంచి రోడ్డు మార్గాన బాగాడోగ్రా విమానాశ్రయానికి చేరుకొని కోలకత్తా వెళ్లారని అధికారులు పేర్కొన్నారు. మరోవైపు టీఎంసీ పార్టీ లోని రెండు వర్గాల్లో కుచ్బిహార్లో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో కాల్పులు కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోగా, ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి.