నరేంద్ర మోడీ సుపరిపాలన అందిస్తున్నారు - కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల
![నరేంద్ర మోడీ సుపరిపాలన అందిస్తున్నారు - కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాల](https://mudranews.in/uploads/images/2023/07/image_750x_64b4de4c487aa.jpg)
చిన్నశంకరంపేట, ముద్ర: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో సుపరిపాలన కొనసాగిస్తున్నారని కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాల అన్నారు. సోమవారం చిన్నశంకరంపేట మండల కేంద్రాన్ని సందర్శించారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మండల అధ్యక్షుడు పోగుల రాజు ఆధ్వర్యంలో దళిత కుటుంబానికి చెందిన సామాన్య కార్యకర్త భూపాల్ ఇంటికి వెళ్లి కార్యకర్తలతో కలిసి అల్పాహారం చేశారు. అనంతరం ఏకశిల సోమేశ్వర ఆలయానికి వెళ్లి శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. గ్రామ సర్పంచ్ రాజిరెడ్డి సోమేశ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ దేశంలోనే మూడో ఏకశిలా సోమేశ్వరాలయం ప్రసిద్ధి చెందినదన్నారు. అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే చేగుంట మండలం పొలంపల్లి గ్రామానికి వెళ్లి మాజీ ఎమ్మెల్యే వాసురెడ్డిని పరామర్శించి, మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో మెదక్ పార్లమెంట్ ఇన్చార్జి జయశ్రీ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నందు జనార్దన్ రెడ్డి, కరణం పరిణిత, జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి, నల్లాల విజయ్, ఎక్కలదేవి మధు, బిజెపి జిల్లా అధికార ప్రతినిధి నందా రెడ్డి, జిల్లా కిషన్ మోర్చా అధ్యక్షుడు మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.