సిద్దిపేటలో మంత్రులకు ఘన స్వాగతం

సిద్దిపేటలో మంత్రులకు ఘన స్వాగతం

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట: వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకై గురువారం నాడు సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులకు జిల్లా అధికార యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికింది. సిద్దిపేటలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు, రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీష్ రావుకు జిల్లా పరిషత్ చైర్పర్సన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ , ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి  తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు సభ్యుడు మూరంశెట్టి రాములు గుప్తా, పట్టణ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు కొండం సంపత్ రెడ్డి,  మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కడవెరుగు రాజనర్సు, తెలంగాణ దళిత సంఘాల ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల చంద్రం, మున్సిపల్ కౌన్సిలర్లు మరుపల్లి శ్రీనివాస్ గౌడ్, తదితరులతోపాటు భారత రాష్ట్ర సమితి నేతలు తీపి రెడ్డి మహేశ్ రెడ్డి  తదితరులు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.