ఈ రోజు   ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? 

ఈ రోజు   ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? 

శుక్రవారం సాయంత్రం చెన్నై సూపర్ కింగ్స్ ,  గుజరాత్ టైటాన్స్  మ్యాచ్‌తో ఐపీఎల్ 2023  అద్భుతంగా ప్రారంభమైంది. ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో చెన్నైపై గుజరాత్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం జరగబోయే మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ లెవెన్ ,  కోల్‌కతా నైట్‌రైడర్స్  జట్లు తలపడనున్నాయి. మొహలీ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కాబోతోంది. ఈ మ్యాచ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చేస్తున్నారు.  ప్రస్తుతానికి మొహలీలో వాతావరణాన్ని బట్టి చూస్తే ఈ మ్యాచ్ జరగడం కాస్త అనుమానంగానే ఉంది. శుక్రవారం అంతా అక్కడ వర్షం   కురుస్తూనే ఉంది. దీంతో కోల్‌కతా జట్టు ఆటగాళ్లు పూర్తి స్థాయిలో ప్రాక్టీస్‌ కూడా చేయలేకపోయారు. ఈరోజు మధ్యాహ్నం కూడా వర్షం పడే సూచనలు కనిపిస్తున్నాయి. షెడ్యూల్ ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఈ మ్యాచ్ మొదలు కావాల్సి ఉంది. వర్షం వల్ల అంతరాయం ఏర్పడితే కాస్త ఆలస్యంగా మ్యాచ్ మొదలు కానుంది .  ఇరు జట్లూ కొత్త కెప్టెన్ల ఆధ్వర్యంలో బరిలోకి దిగేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పంజాబ్ జట్టుకు శిఖర్ ధవన్ ,  కోల్‌కతాకు నితీష్ రాణా  సారథులుగా వ్యవహరించనున్నారు. ఇరు జట్లకు ఆడాల్సిన కొందరు విదేశీ ఆటగాళ్లు ఇంకా భారత్ చేరుకోలేదు. దీంతో కెప్టెన్లే ఇరు జట్లకు కీలక ఆటగాళ్లుగా బరిలోకి దిగుతున్నారు. మరి, ఈ మ్యాచ్‌ను వర్షం సాగినిస్తుందో, లేదో చూడాలి.