మొదటి రోజు 4 నామినేషన్లు.  

మొదటి రోజు 4 నామినేషన్లు.  

ముద్ర ప్రతినిధి, కామారెడ్డి:నామినేషన్ల పర్వం మొదలైన శుక్రవారం కామారెడ్డి నియోజక వర్గంలో 4 నామినేషన్లు దాఖలు కాగా, జుక్కల్, యెల్లారెడ్డి నియోజక వర్గాల నుండి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్థులుగా వెంకన్న గుగులోతు, ఆరోళ్ల  నరేష్, చిట్టిబొయిన సులోచన రాణి నామినేషన్లు దాఖలు చేయగా,  బి.ఎస్.పి  అభ్యర్థిగా ఉడ్తవార్ సురేష్ గౌడ్ ఒక్కో సెట్ చొప్పున నామినేషన్ దాఖలు చేశారని ఆయన తెలిపారు.