జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యున్ని కలిసిన కలెక్టర్ అదనపు కలెక్టర్ 

జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యున్ని కలిసిన కలెక్టర్ అదనపు కలెక్టర్ 

ముద్ర ప్రతినిధి, సూర్యాపేట :జాతీయ మైనారిటీ కమిషన్ ప్యానల్ సభ్యులు డాక్టర్ నైసా కిరణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుత్యాన్ని అందజేసిన జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ పాటిల్ హేమంత కేశవ్. సోమవారం  కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు జాతీయ మైనార్టీ కమిషన్ ప్యానల్ సభ్యులు డాక్టర్ మేష కిరణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు, జిల్లా ఆదనపు కలెక్టర్ పాటిల్ హేమంత కేశవ్ తో కలిసి సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా పేద మైనార్టీల కోసం అమలవుతున్న పథకాలు మైనారిటీల ఆర్థిక అభివృద్ధి, ఉపాధి రంగాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో కోదాడ ఆర్డిఓ కిషోర్ కుమార్, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి టి విజయేందర్ రెడ్డి ,ఉర్దూ అధికారిని వృక్షాలు సుల్తానా సిబ్బంది పాల్గొన్నారు.