గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను సందర్శించిన మహారాష్ట్ర రైతుల బృందం

గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను సందర్శించిన మహారాష్ట్ర రైతుల బృందం

సిద్దిపేట ముద్ర ప్రతినిధి :ముఖ్యమంత్రి నియోజకవర్గ కేంద్రమైన గజ్వేల్ లో ఉన్న ఇంటిగ్రేటెడ్ కూరగాయల మార్కెట్ ను మహారాష్ట్ర రైతుల పరిశీలించింది సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో గురువారం నాడు మహారాష్ట్రలోని నాందేడ్ బీడ్ జిల్లాలకు చెందిన పలువురు రైతులు గజ్వేల్ కు వచ్చారు.ఏఎంసీ చైర్మన్ మాదాసు  శ్రీనివాస్ ఆధ్వర్యంలో గజ్వేల్ సమకృత కూరగాయల మార్కెట్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించిన మహారాష్ట్ర రైతుల బృందం అనంతరం కొండపోచమ్మ సాగర్ సందర్శనకు వెళ్ళింది ఈ సందర్భంగా మహారాష్ట్ర రైతులు మీడియాతో మాట్లాడుతూ తమ ప్రాంతంలో ఇటువంటి సౌకర్యాలు లేవని తెలిపారు.