పెంబట్లలో పిడుగు పడి మహిళా రైతు మృతి

పెంబట్లలో పిడుగు పడి మహిళా రైతు మృతి

సారంగాపూర్ ముద్ర:సారంగాపూర్ మండలంలోని పెంబట్ల గ్రామంలో పిడుగు పడి మహిళా రైతు మృతి చెందగా ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. పెంబట్ల గ్రామానికి చెందిన జోగిని పద్మ ,గంగ మల్లు దంపతులు గ్రామ శివారులోని ఊరగుట్ట వద్దగల వ్యవసాయ భూమిలో హార్వెస్టర్ తో వరి పొలం కోపిస్తున్నరు. అదే సమయంలో వర్షం పడుతుండటంతో చెట్టు కిందకు వెళ్లారు.

కొంత సేపటికి  అదే చెట్టుపై పిడుగు  పడింది దీంతో చెట్టు కింద ఉన్న జోగిని పద్మ అక్కడికక్కడే మృతిచెందగా ఆమె భర్త జోగిని గంగామల్లు కు తీవ్ర గాయాలయ్యాయి. గంగమల్లును మెరుగైన చికిత్స నిమిత్తం జగిత్యాల లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతున్నాడు. కాగా మృతురాలు జోగిని పద్మను శవపంచనామ నిమిత్తం జగిత్యాల లోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. పెంబట్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.వీరికి ఇద్దరు కుమారులు మధు, మనోహర్ లో ఉన్నారు.