యువతి పెళ్లికి నిరాకరించిందని మనస్థాపంతో  యువకుని ఆత్మహత్య

 యువతి పెళ్లికి నిరాకరించిందని మనస్థాపంతో  యువకుని ఆత్మహత్య

జయశంకర్‌ భూపాలపల్లి
మహాదేవపూర్‌ మండలం అన్నారం సరస్వతి బ్యారేజ్‌ లో దూకి ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం మందపురంకి చెందిన వినోద్‌( 29)గా గుర్తించారు.  ప్రేమించిన  యువతి పెళ్లికి నిరాకరించిందని మనస్థాపంతో వినోద్‌ ఆత్మహత్యకు పాల్పడ్డాని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహన్ని  పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్‌ ప్రభుత్వ హాస్పిటల్‌ కు తరలించారు.