జైనపల్లిలో అయోధ్య  అక్షింతల శోభాయాత్ర 

జైనపల్లిలో అయోధ్య  అక్షింతల శోభాయాత్ర 

ముద్ర ప్రతినిధి, బీబీనగర్: రామ జన్మభూమి అయోధ్య రామ మందిర పునర్నిర్మాణ కమిటీ సహకారంతో బీబీనగర్ మండల పరిధిలోని జైనపల్లి గ్రామానికి చేరుకున్న శ్రీరామ పూజిత అక్షింతల శోభాయాత్రను శనివారం గ్రామంలో ప్రధాన వీధుల గుండా మేళతాళాల చప్పుళ్లతోపాటు జై శ్రీరామ్ నినాదాలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. శోభాయాత్రలో భాగంగా స్వామి వారి అక్షింతలతోపాటు అయోధ్య మందిర ఫొటోతో కూడిన నివేదన పత్రాన్ని ప్రతి ఇంటికి అందజేశారు.

అయోధ్య ఆలయ ప్రాణప్రతిష్ట రోజు ప్రతి ఇంట్లో ఐదు దీపాలు వెలిగించి మరో దీపావళి జరుపుకోవాలని కోరారు. అంతకు ముందు గ్రామంలోని శ్రీ హనుమాన్ కాశీ విశ్వశ్వర స్వామి ఆలయంలో అక్షింతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మొరిగాడి బాలమల్లేష్ గౌడ్, ఉప సర్పంచ్ నక్కీర్తి రమేష్, మాజీ సర్పంచ్ అంజయ్య గౌడ్, నాయకులు గూడూరు శ్రీనివాస్ రెడ్డి, అమరలింగం గౌడ్, చంద్రశేఖర్ గుప్తా,శ్రీ నివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.